అన్నమయ్య జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా రాజంపేట కలిసిన జనసేన నాయకులు

అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి బూత్ పరిధిలో ఏమైనా సమస్యలు ఉంటే పరిస్కారం కోసం తమ అభిప్రాయాలను తెలియజేయండి అంటూ కలెక్టర్ వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు, పూలమాలతో సన్మానం చేసిన రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ హసన్ బాషా చిరు సత్కారామ్ చేయడం జరిగింది అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్గా పిఎస్ గిరిష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మొదటిసారి కలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ రియాజ్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్, మైనార్టీ నాయకులు వసీవుల బాషా, అధ్యక్షులు మౌలానా రషీద్ అహ్మద్ తదితరులు పాల్గొనడం జరిగింది.