పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కలిసిన జనసేన నాయకులు

గుంటూరు, జనసేన పార్టీ పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిశ్శంకర శ్రీనివాస్ పై అధికార పార్టీ నాయకుల సహకారంతో పోలీస్ స్టేషన్ లో పెట్టిన అక్రమ కేసులపై వివరించడమైనది. నియోజకవర్గ పార్టీ అభివృద్ధి గురించి చర్చ మరియు పార్టీ అన్ని విధాలుగా ప్రతి విషయంలో మీకు తోడుగా ఉంటుంది అని ఛైర్మన్ మరియు జిల్లా అధ్యక్షులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.