గ్రామ సచివాలయంలో జనసేన వినతి

పార్వతీపురం మండలం, ఎం.ఆర్ నగరం పంచాయతీలో కోట్ల రూపాయల విలువ చెసే ప్రభుత్వ స్థలాన్ని భూబకాసురుల చేత కబ్జా చేసి పునాదులు వేస్తున్నారు. దీనిపై జనసేన పార్టీ ఇంతకుముందు ఆ గ్రామ సచివాలయంలో పిర్యాదు చేయడం జరిగింది. దానికి ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, విఆర్వో స్పందించి వారికి నోటిసులు జారీ చెయడంతో మూడు నెలలు కట్టడాలు ఆపి మరల ఇప్పుడు మొదలు పెడుతున్నారు. దీనిపై మరల జనసేన పార్టీ రంగంలోకి దిగి కట్టడాలు ఆపించి వారిపై తక్షణమే కబ్జధారులపై చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి, విఆర్వోకి పిర్యాదు చేయడం వారు సానుకూలంగా స్పందించి, వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయుకులు ఆగురు మణి, గుంట్రేడ్డి గౌరీశంకర్, చిట్లు గణేశ్, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, నవీన్, మహేశ్, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.