పొందూరు మండలంలో పేడాడ రామ్మోహన్ రావు పర్యటన

ఆమదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలంలో జాడ పేట మరియు తండ్యాం గ్రామాలలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ముఖ్యంగా విద్యుత్ సమస్యలతో తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని, రోడ్లు మరమ్మత్తులు లేక డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలమవడంతో ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్యాం గ్రామం లో ఎస్సీ కాలనీలో చాలా మందికి పక్కా ఇళ్లు మంజూరు కాకపోవడంతో వర్షాకాలంలో ఉండడానికి అవకాశం లేక ప్రభుత్వం పైన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ వైఫల్యం వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను మానవతా దృక్పథంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో, పరిష్కారం కోసం కృషి చేస్తానని రామ్మోహనరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొందూరు మండల నాయకులు చిన్నం నాయుడు, రమణ, సూర్య, బాబూరావు, బాలు, చిన్న, సంతోష్, రాజు, మధు మరియు పెద్ధ సంఖ్యలో గ్రామ జనసేన కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.