జగన్ ను తరిమికొట్టేందుకు జనసేన, టీడీపీ, బిజేపీ పార్టీలు కలిసికట్టుగా పోరాడుతున్నాయి!

తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ ను పీడిస్తున్న జగన్ తరిమికొట్టేందుకు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పోరాడుతున్నాయని ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు.‌ ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. సకల జనుల్లో  చైతన్యం తెచ్చేందుకు ఉమ్మడిగా కార్యాచరణ చేస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నామని బుధవారం జరిగిన ఎన్నికల శంఖారావంలో 14,17 వార్డులలో నవ్వారుపేట మరియు నరసింహ పేట నందు తెలుగుదేశం ఇంచార్జ్ వలవల బాబ్జి బిజెపి కన్వీనర్ ఈతకోట తాతాజీ తెలుగుదేశం మాజీ వైస్ చైర్మన్ గొర్ల శ్రీధర్ వార్డులో గజమాలతో స్వాగతం పలికి ప్రజలతో మమేకమై ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంటికి హారతులు ఇచ్చి శ్రీనివాస్ ని అక్కడ ప్రజలు ఆశీర్వదించారు. వార్డులలో నెలకొన్న సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా కూటమిని ఆశీర్వదించాలని కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ముందుగా రోడ్ల వ్యవస్థ డ్రైనేజీలు వ్యవస్థ మెరుగుపరుస్తామని శ్రీనివాస్ తెలిపారు.