జనం వద్దకు జనసేన.. జనంకోసం జనసేన

  • విజయనగరం ప్రజా సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించే దిశగా మొదలైన వినూత్న కార్యక్రమం..
  • ప్రతి సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద

విజయనగరం: జనం వద్దకు జనసేన.. జనంకోసం జనసేన కార్యక్రమం మొదటివారంలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10:00 గంటలకు విజయనగరం కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ బాధితుల తరుపునుంచి వినతులు, అర్జీలు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరించటం కోసం కలెక్టర్ వారిని సంప్రదించడం జరిగింది.. ఈ కార్యక్రమం ప్రతీ సోమవారం కలెక్టర్ ఆఫీస్ నందు చేపట్టడం జరుగుతుందని, ఎవరికి ఏ సమస్య ఉన్నా సంప్రదించండని యశస్వి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు శ్రీమతి మాత గాయత్రి, డాక్టర్ మురళి మోహన్, బొబ్బది చంద్రు నాయుడు, కోర్నానా రామకృష్ణ, రాజేష్, సాయి, సందీప్ తదితరులు హాజరయ్యారు.