విద్యుత్ షాక్ తో మృతి చెందిన జనసైనికుడు కుటుంబానికి జనసేన పరామర్శ

  • దీనావస్థ స్థితిలో ఉన్న జనసైనికుడు కొప్పిశెట్టి రామస్వామిని ఆదుకొందాం.. ఉండ్రు భగవాన్ దాస్

అమలాపురం నియోజకవర్గం, ఉప్పల గుప్తం మండలం, కూనవరం గ్రామంలో తాపీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఒక పేద కాపు కులస్తుడు, జనసేన పార్టీ అభిమాని విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. వివరాల ప్రకారం కొప్పిశెట్టి రామస్వామి ఊసలు కట్ చేస్తుండగా కరెంట్ షాక్ తో మరణించడం జరిగింది. జనసైనికులద్వారా ఆ కుటుంబ దీనావస్థ స్థితిని తెలుసుకొన్న జనసేన నాయకులు ఉండ్రు భగవాన్ దాస్, పోలిశెట్టి బాబు వారి యొక్క బాధను అర్థం చేసుకొని వారికి జనసైనికులు, నాయకులు తోచిన సహాయం చేయవలసిందిగా జనసేన నాయకులను కోరారు. మరణించిన కొప్పిశెట్టి రామస్వామికి భార్య దుర్గ వయసు (35), ఇద్దరు పిల్లలు కుమార్తె పద్మజ వయసు(16), కుమారుడు ఫణీంద్ర వయసు (13) ఉన్నారు. జనసైనికులు, నాయకులు వారిని దృష్టిలో పెట్టుకుని వారికి ఎంత కష్టం అనుకున్నా మీరు సాయం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటారని జనసేన తరపున మిమ్మల్ని కోరుతున్నాను అని డి. రావులపాలెం సర్పంచ్ ఉండ్రు భగవాన్ దాస్ ఒక ప్రకటనలో తెలిపారు.