జనంలోకి జనసేన సిద్ధాంతాలు

  • ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేస్తున్న జనసేన నాయకులు

రాజంపేట సెప్టెంబర్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024లో ముఖ్యమంత్రి కావాలని జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఉద్దేశంతో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నామని రాజంపేట జనసేన నాయకులు అన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ వెంకటరమణ ఆదేశాల మేరకు శుక్రవారం రాజంపేట మండలం అప్పా రాజుపేట పంచాయతీలోని అత్తిరాల, వినాయక నగర్, అత్తిరాల ఎస్సీ కాలనీ పలు గ్రామాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జనసేన పార్టీ విధి విధానాలు పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టోలో రూపొందించిన అంశాలను సామాన్య ప్రజలకు వివరించారు. ఈసందర్భంగా రాజంపేట జనసేన యువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.ప్రజల సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలంటే 2024లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా రావాలన్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా జనసేన పార్టీకి మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కడప లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, జనసేన నాయకులు భాస్కర్ పంతులు, తాళ్లపాక శంకరయ్య. జనసేన యువ నాయకురాలు పోలిశెట్టి రజిత, పోలిశెట్టి చంగల్ రాయుడు, వీరయ్య ఆచారి, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, జనసేన వీర మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.