దినదిన అభివృద్ధి చెందుతున్న జనసేన – అంబులెన్స్ సేవలు అతి త్వరలో ప్రారంభం

రాజానగరం, రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా బలపడుతున్న జనసేన పార్టీని ప్రజల ఆదరిస్తున్న తీరును చూసి ఆనందం వ్యక్తం చేసిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ. ప్రజల కోసం పరితపించే అధినాయకుని బాటలో నడవడం ద్వారా ప్రజాసమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి మా వంతు సహకారం అందించడం మా భాగ్యమని బత్తుల తెలియజేశారు. అతి త్వరలోనే అంబులెన్స్ సేవలను నియోజకవర్గంలో ప్రజలకు చేరువ చేస్తామని ఈ సందర్భంగా భక్తుల తెలియజేశారు. నియోజకవర్గంలోని మూడు మండలాలలో మండలానికి ఒకటి చొప్పున మూడు అంబులెన్స్ లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న పనిలో బత్తుల ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు.