జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కలిసిన జనసైనికులు

చిట్వేలు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణని చిట్వేలి మండల జనసైనికులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రైల్వేకోడూరులో పలు సమస్యలపై విచ్చేసిన ఆయనను చిట్వేలి జనసేన నాయకులు మాదాసు నరసింహ, పగడాల శివ, కడుమూరి సుబ్రమణ్యంలు ఆయనతో చర్చించారు. చిట్వేలులో త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందన్నారు. ఈ సందర్భంగా చిట్వేలు మండలం జనసేన నాయకులు మాదాసు నరసింహ మాట్లాడుతూ చిట్వేల్ లో జనసేన మండల కమిటీ ఏర్పాట్లు మరియు ఇతర ప్రధాన సమస్యలపై చర్చించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.