గల్ఫ్ సేన జనసేన యూఏఈ ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

గల్ఫ్ సేన: గల్ఫ్ సేన జనసేన యూఏఈ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2, శనివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు అజమాన్ మైత్రి ఫామ్స్ నందు జనసేన పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా, ఆట, పాటలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటులు మరియు జనసేన నాయకులు పృథ్వి రాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూఏఈ లో ఉన్న జనసైనికులు భారీ సంఖ్యలో సమావేశం అయ్యారు. ఇందులో భాగంగా నా సేన నా వంతుకు గా కోటి రూపాయలు విరాళంలో భాగస్వాములకు ప్రత్యేక ఆహ్వానంతో కృతజ్ఞతలు తెలియజేశారు. గల్ఫ్ సేన జనసేన యూఏఈ ఎక్సిక్యూటివ్ టీమ్ ను 50 మందితో వివిధ కమిటీలు (ఫైనాన్స్, సోషల్ మీడియా, ఈవెంట్స్ అండ్ లాజిస్టిక్, అడ్మిన్, వేల్ఫేర్ కమ్యూనిటీ, అడ్వైసరీ, ఎన్నారై మహిళా విభాగం) లను పార్టీ ప్రధాన కార్యదర్శి నాగ బాబు అనుమతితో ఆరు గల్ఫ్ దేశాల పార్టీ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించుచున్న కేసరి త్రిమూర్తులు ఈ సభా ముఖంగా ప్రకటించారు. ఇటువంటి కమిటీలు త్వరలోనే పార్టీ ఆదేశాలతో మిగిలిని గల్ఫ్ దేశాలలో కూడా ఏర్పాటు చేస్తాం అని త్రిమూర్తులు తెలియ చేశారు. ఈ కమిటీ సభ్యుల చేత పృద్వి పార్టీ బలోపేతం కోసం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పృథ్వి రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్ట పడుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ముఖ్య మంత్రిని చేయడంలో కీలక పాత్ర పోషించాలని గల్ఫ్ ఎన్.ఆర్.ఐ లను కోరారు. గల్ఫ్ జనసైనికులని ఉద్దేశించి ప్రసంగించి గల్ఫ్ జనసైనికుల పాత్ర జనసేన బలోపేతంలో మరువలేనిది అని నా సేన కోసం నా వంతు కోటి రూపాయలు పార్టీ కోసం గల్ఫ్ దేశాల నుంచి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు అని ఆయన జనసైనికులను కొనియాడారు. ఇంకా ముందు ముందు పార్టీ కోసం గల్ఫ్ జనసైనికుల ముఖ్య పాత్ర పోషించి పార్టీ గెలుపు కోసం పని చేయాలి అని ఆయన గల్ఫ్ జనసేన కార్యకర్తలను కోరారు. అలాగే నా సేన కోసం నా వంతులో భాగం అయిన ప్రతి జనసైనికుడిని పృథ్వి రాజ్ ప్రత్యేకంగా అభినందించారు. జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు ప్రసంగాలతో వారి అభిప్రాయాలను తెలియజేశారు. పార్టీ విజయానికి చేయవలసిన సూచనలు కార్యాచరణను వివరించారు. అనంతరం కార్యనిర్వాహక సభ్యుల ఆధ్వర్యంలో పృథ్వి రాజ్ ఘనంగా సన్మానించారు. తదుపరి కార్యక్రమం కేకే కటింగ్ తో పవన్ కళ్యాణ్ గారికి గల్ఫ్ సేన జనసేన ద్వారా శుభాకాంక్షలు తెలియపరిచారు.