అగ్ని ప్రమాద బాధితులను ఆదుకున్న జనసేన

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సర్వము కోల్పోయిన బాధితులను ఆదుకున్న జనసేన
మామిడికుదురు మండలం, పెదపట్నంలంక గ్రామం, ధనమ్మపేటలో ఒక అగ్నికులక్షత్రియుని బంగాళా పెంకిటిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఆహుతి అయి, సర్వము కోల్పోయిన బాధితులకు అప్పటికప్పుడు.. తక్షణ సహాయముగా జనసేన పార్టీ తరఫున 19000 రూపాయలు నగదు, మరియు 5000 రూపాయలు విలువగల నిత్యావసర సరుకులను మండల అధ్యక్షులు జాలేం శ్రీనివాస్ రాజా, ఎం.పీ.టీ.సీ కొమ్ముల జంగమ్మాయ చేతులు మీదుగా అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కంకిపాటి నరసింహారావు, మద్దింశెట్టి బుజ్జి, పోతు కాశీ, గ్రామ శాఖ అద్యక్షుడు గిడుగు బంగారం, కొమ్ముల రాము, సుందరనీడి చంటి మరియు జనసైనికులు పాల్గొన్నారు.