మాడుగుల జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం

ఆత్మహత్యలు చేసుకుని మరణించిన కౌలు రైతు కుటుంబాలకు భరోసాగా జనసేన అధినేత ఒక్కో కుటుంబానికి ఒక్కో లక్ష రూపాయలు ఆర్ధికసాయం ప్రకటించడం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమానికి తనవంతుగా జనసేనాని 5 కోట్ల విరాళం ప్రకటించడం జరిగింది. మాడుగుల నియోజకవర్గం, దేవరపల్లి మండలం, దేవరపల్లి గ్రామమంలో నాలుగు రోడ్ల జంక్షన్లో అంబేద్కర్ విగ్రహం వద్ద రైతు కుటుంబాలను ఆదుకునేందుకు 5 కోట్ల విరాళం ప్రకటించిన జనసేన అధినేత చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగుల జనసేన నాయకులు గుమ్మడి శ్రీరాం మరియు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొనడం జరిగింది.