పారిశుద్ధ కార్మికులకు అండగా తిరుపతి జనసేన

తిరుపతి, గత కొంతకాలంగా తిరుపతిలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న న్యాయమైన నిరసనలకు మద్దతుగా జనసేన పార్టీ వారికి సంఘీభావం తెలియజేస్తూ, వారు కోరిన జీతభత్యాలను 18.000 ల నుంచి 21.000, (3000 పెంపు) వెంటనే పెంచాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ… ఈ నిరసనల నేపథ్యంలో నగరంలో ఎక్కడి చెత్త అక్కడే ఉండడంతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, కావున సంబంధిత మునిసిపల్ అధికారులు దీనిపై దృష్టి సారించి తక్షణమే చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి మరియు ముఖ్య నాయకులతో కలిసి మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.