భీమవరం నియోజకవర్గంలో జనసేన జిల్లా సమావేశం

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం నియోజకవర్గంలో జనసేన జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గోవిందరావు వ్యవహరించారు. ఆయన మాట్లాడుతూ పార్టీనీ రానున్న రోజుల్లో ఎలా ముందుకు తీసుకువెళ్లాలని నాయకులకు సూచించారు. పార్టీ విధివిధానాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి అని అలాగే ప్రభుత్వం వైఖరిని ఎండగట్టాలని తెలియజేసారు.అలాగే 20వ తారీఖున జరగనున్న మత్స్యకార అభ్యున్నతి సభకు వస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభను విజయవంతం చేయాలని నాయకులకు కార్యకర్తలకు, వీరమహిళలకు, పిలుపునిచ్చారు. ఈ జిల్లా సమావేశానికి పిఏసి సభ్యులు కనకరాజు సూరి, పీఏసీ సభ్యులు ఆచంట నియోజవర్గ ఇన్చార్జి చేగొండి ప్రకాష్, తణుకు నియోజకవర్గం ఇంచార్జి విదివాడ రామచంద్రరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పల నాయుడు, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి మేక ఈశ్వరయ్య, పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి బాలరాజు, రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి కారేపల్లి శాంతి ప్రియ, జిల్లా వైస్ ప్రెసిడెంట్లు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు, ఎంపీటీసీలు జడ్పిటిసి, గ్రామ ప్రెసిడెంట్లు, నూతనంగా నియమితమైన మండల అధ్యక్షులు, నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.