యాక్సిడెంట్ అయిన జనసైనికునికి 22,440 రూపాయల చెక్కు అందజేత

తూర్పుగోదావరి, జనసేన పార్టీ పిఏసి సభ్యులు నాదెండ్ల మనోహర్, తూర్పుగోదావరి జనసేన పార్టీ ఇంచార్జ్ కందుల దుర్గేష్ మరియు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ సమక్షంలో రామచంద్రపురం రూరల్ వెల్ల గ్రామం జనసేన నాయకులు కొమిరెడ్డి సురేష్ కి ఇటీవల బైక్ యాక్సిడెంట్ జరిగింది. వారికి జనసేన పార్టీ తరఫున 22,440 రూపాయల చెక్కును మట్లపాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర అందజేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ లు, జనసేన నాయకులు, జనసేన వీరమహిళలు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.