విలేకరి కుటుంబానికి జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య చేయుత

సింగనమల నియోజకవర్గం నార్పల మండలం విలేకరిగా పనిచేస్తున్న ప్రహ్లాద ఇటీవల ఓ ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య విలేకరి కుటుంబానికి చేయూతను అందించారు. ఆదివారం ప్రహ్లాద కుటుంబ సభ్యులకు రూ 5 వేలు ఆర్థిక సహాయం అందించారు. జనసేన పార్టీ ప్రహ్లాద కుటుంబానికి అండగా ఉంటుందని ఈశ్వరయ్య భరోసా ఇచ్చారు.