జనసేనాని అభిమానులు ఒకరికి మించి ఒకరు

అమలాపురం, ఒక్కోసారి అభిమానము అవధులు దాటడము అంటే ఇదేనేమో అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఉప్పలగుప్తము సమీపంలో పెదగాడవిల్లి గ్రామ కాపురస్తులు నూకల సుబ్బారావు(రాజా) మరియు శ్రీమతి లక్ష్మీ శైలజ ల ఏకైక కుమార్తె చిరంజీవి సిరికి రజస్వల కార్యక్రమానికి విందు భోజనము సెప్టెంబర్ 11 ఆదివారము స్వగ్రామములో ఏర్పట్లు చేస్తూ క్రింద టాగ్ లైన్ వ్రాసారు. కట్నకానుకలు ఎవరయినా ఇవ్వదలిస్తే జనసేన పార్టీకి వేయండి అని ఇటీవల జనసేన అధినేత పిలుపు మేరకు నా సేన కోసం నా వంతు కార్యక్రమానికి ఇచ్చిన గూగుల్ పే నెంబర్ పొందుపరిచి తన గొప్పతనాన్ని పార్టీపై ఉన్న అపార ప్రేమను ప్రదర్శించారు.