పొట్టి శ్రీరాములు విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన నరసరావుపేట జనసేన

నరసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డ్స్ పట్టుకొని నల్ల రిబ్బన్ తో మౌన ప్రదర్శన చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలు ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేకపోతే ఎంపీలు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అద్దేపల్లి ఆనందబాబు, ఆర్కే యాదవ్, అబ్దుల్ రవూఫ్, ఈశ్వర్, బెల్లంకొండ అనిల్ , వంశీ, నాగుల్ మీరా, గుప్తా శ్రీకాంత్, కృష్ణం శెట్టి గోవింద్, బోనం జయరామ్, రామారావు, రామకృష్ణ, కొండ వెంకటేశ్వర్లు, బొర్రయ్య, చంటి తదితరులు పాల్గొన్నారు.