జనం కోసం జనసేన

పోలవరం నియోజవర్గం, జీలుగుమిల్లి మండలం, దిబ్బగూడెం రెడ్డిగూడెం గ్రామాల్లో బుధవారం జనం కోసం జనసేన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ప్రతి ఇంటింటికీ తిరిగి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వారి సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులతో మాట్లాడటం జరిగింది. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా.. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సిరి బాలరాజు, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, వీరంకి వెంకటేశ్వరరావు, నారాయణ కుంజా రమేష్, అనిల్ కుమార్, కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.