బలం పుంజుకుంటున్న జనసేన.. పలువురు బీసీ నాయకులు జనసేనలో చేరిక

పి గన్నవరం మండలం జనసేన అధ్యక్షులు సాధనాల వేంకట సత్యనారాయణ(జెేడి) అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి వాసంశెట్టి కుమార్ ఆధ్వర్యంలో పి గన్నవరం మండలానికి చెందిన వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సుమారు 20 కుటుంబాలకు చెందిన నాయకులు తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందులదుర్గేష్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుర్గేష్ పార్టీలో చేరిన వారికి పార్టీకండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన సభ్యులు మాట్లాడుతూ.. ఇప్పుడున్న ప్రభుత్వం వివిధ పథకాలపేరుతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. జనసేనఅధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలునచ్చి జనసేన పార్టీలోకి వచ్చామని తెలియజేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ బడుగు బలహీనవర్గాల పార్టీ అని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక ఉన్నతమైన, బలమైన పార్టీగా ఏర్పడనుందన్నారు. పార్టీఅధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పేదబడుగు బలహీన వర్గాల, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తారన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం నిత్యావసర వస్తువులు, విద్యుత్ చార్జీలు, ఆర్టీసీఛార్జీలు, గ్యాస్ ధరలు, పెంచుకుంటూ పోతూ పేదవాడికి నెత్తిమీద బండరాయి మోపీ ప్రజలను ఇబ్బందిపాలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి రాజ్యాధికారం వస్తుందని ధీమావ్యక్తంచేశారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన అందరికీ.. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మద్దాలచంటిబాబు, యడ్ల ఏసుభాస్కర్రావు, తాటికాయల వెంకటేష్, దైవాలరాంబాబు, కో ఆప్షన్ మెంబర్ షేక్ దొరబాబు, భైరశెట్టి శంకర్, ముసిని భాస్కర్రావు, వాసంశెట్టి గోవిందు, కండిబోటి నర్సింహారావు, కండిబోటి సాయిబాబు, గుబ్బలశివ, కాండ్రేగుల సాయిబాబు, మట్టపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.