కావలి మునిసిపాలిటీ 10వ. వార్డ్ కు నీళ్ల టాంక్ ను అందించిన జనసేన నాయకులు

కావలి నియోజక వర్గం, కావలి మున్సిపల్ 10వ.వార్డ్ లో గత 4రోజులుగా నీళ్ళ సరాఫరా లేక ప్రజలు ఇబ్బంది పడుతూ.. వార్డ్ కౌన్సిలరు, అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళినా ఫలితము లేక జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకొని రాగా వెంటనే స్పందించి
కావలి టౌన్ ప్రెసిడెంట్ పోబ్బ సాయి అధ్వర్యంలో వెంటనే వాటర్ ట్యాంకు ను 10వ.వార్డ్ కు అందించి వారి మన్ననలను పొందారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మరియు రిషికేష్ మాట్లాడుతూ.. వైస్సార్ పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలిలో నీటి కొరత లేదని చెబుతూ ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టడము ఏమిటని? నిలదీశారు. ఇటీవల జనసేన పార్టీ తరుపున సమ్మర్ స్టోరేజ్ టాంక్ ను సందర్శించి ఎండాకాలంలో నీటి కొరతను ఎలా తీరుస్తారు? అని మున్సిపల్ కమిషనర్ను ఇంచార్జి అళహరి, సుధాకర్, నాయకులతో కలిసి వివరాలు సేకరిస్తే ఎమ్మెల్యే గారు ఆ రోజు మేము ఏదో డ్రామాలు ఆడుతున్నారు అని హేళన గా మాట్లాడారు. ఈ రోజు పరిస్తితి చూస్తే ఇంకా రాబోయే రోజులలో ప్రజలు ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని జనసేన పార్టీ తరుపున ఎమ్మెల్యే గారిని ప్రశ్నించడం జరిగింది. జనసేన పార్టీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని మరొకసారి రుజువు చేసుకున్నాం. ఈ కార్యక్రమములో రుషికేశ్, సుధీర్, మురళీ కృష్ణ, అడ్వకేట్ సిద్దు, ఆల శ్రీనాథ్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.