ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలు వెంటనే పరిష్కరించాలి: తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాలలో బాత్రూమ్ ల నిర్మాణం తొందరగా పూర్తి చేయాలని అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మరియు మండల నాయకులు పొడి శెట్టి విజయ్, మొలుగూరి అరవింద్, గుండా సాయి చంద్, మోరె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.