గంగన్నగూడెంలో జనబలంతో జనంలోకి జనసేన

దెందులూరు నియోజకవర్గంలోని, గంగన్నగూడెం గ్రామంలో కొఠారు ఆదిశేషు నేతృత్వంలో చేపట్టిన జనంలోకి జనసేన కార్యక్రమాన్ని గురువారం విజయవంతంగా కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా కొఠారు ఆదిశేషు మాట్లాడుతూ.. ఇంటిటికి వెళ్ళి మ్యానిఫెస్టో ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యేలా వివరిస్తూ.. పార్టీ సిద్ధాంతాలను బలంగా జనంలోకి తీసుకెళ్తున్నామని.. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసును ప్రజలు నిరంతరం గుర్తుంచుకోవాలనే ఉద్ద్యేశంతో ఇంటిటికి గాజుగ్లాసుని ఇచ్చి.. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. జనసేనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ మార్పుకు సూచన అని.. ముందు ముందు మరింత వేగంతో ప్రజల్లోకి పార్టీని తీసుకెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి తేజశ్వి, కావూరి వాణి, దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు పూజారి వెంకటరత్నం నాయుడు, తిరుపతి వాసు, పూజారి సీతారాం, పరసా వెంకటధర్మతేజ, ఉజ్జు నాగరాజు, ఏనుగు రామకృష్ణ, త్సవలం నాగబాబు, ఇంటూరి కృష్ణ, పట్టపు నాగ రాజేష్ కుమార్, అక్కునాయుడు, నిమ్మన రవికుమార్, చిన్నాల మోహనసాయి, సాయితేజ, భార్గవ్ మరియు గంగన్నగూడెం నుండి చందు, బాలయోగి, వినయ్, కిషోర్, దాసుబాబు, నాగేంద్ర, నరేష్, ప్రభాస్, రాజేష్, సుమంత్, అశోక్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.