యువత భవిత కోసం ఆలోచన చేసే నిజమైన నాయకుడు జనసేనాని: నలిశెట్టి శ్రీధర్

  • యువత భవిత కోసం బంగారు బాటలు వేసేందుకు, నవతరాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పాలకుల ధోరణి నిలదీసేందుకు సరైనవేదిక యువశక్తి

ఆత్మకూరు: జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక ఏర్పాట్లలో భాగంగా, జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు, ఆత్మకూరు నియోజకవర్గం, సంగం మండలంలో నియోజకవర్గ నాయకులు దాడి భాను కిరణ్, సంగం మండల అధ్యక్షులు రాకేష్ యాదవ్ ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సంగం మండలం, అనసూయ నగర్ కు చెందిన పలువురు యువకులు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్రాయుధం లాంటి మనసున్న యువత మన దేశానికి కావాలి అని చెప్పిన స్వామి వివేకానంద మాటలను సదా స్మరించుకొని, యువత భవిత కోసం అనునిత్యం ఆలోచన చేసే నిజమైన నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అని తెలిపారు. యువత భవిత కోసం బంగారు బాటలు వేసేందుకు, నవతరాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పాలకుల ధోరణి నిలదీసేందుకు సరైనవేదిక ఈ యువశక్తి కార్యక్రమం అని తెలిపారు. మన తరానికి ఏం కావాలి, మనతోపాటు మన సమాజ అభివృద్ధికి ఏం సాధించుకోవాలి, యువశక్తి వేదికనుండే గళం వినిపించే మహత్తర అవకాశాన్ని జనసేన పార్టీ కల్పించిందని, యువత పవన్ కళ్యాణ్ గారితో కలిసి వేదిక పంచుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూకబ్జాలు, దందాలు, భరోసా లేని రైతాంగం, విద్య, వైద్యం, పర్యావరణ విధ్వంసం, యువత ఉపాధి, వర్తమానం రాజకీయాలు, మత్స్యకారులు బతుకు పోరాటం, మైనింగ్ మాఫియా, పారిశ్రామిక వృద్ధి ఆవశ్యకత తదితర అంశాలపై మన ఆలోచనలను ఆవిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో జరిగే యువశక్తి కార్యక్రమానికి మనమందరం పాల్గొనాలని జనసైనికులు అందరికీ పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.