జనసైనికుడి పిల్లల చదువులకు వాసగిరి మణికంఠ చేయూత

  • జనసేనాని పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో అనంత జిల్లా జనసేన కార్యదర్శి వాసగిరి మణికంఠ దాతృత్వం.
  • మానవత్వం… పరిమళించినవేళ…
  • అమరుడైన జనసైనికుడి పిల్లల చదువులకు పుస్తకాలు మరియు “10 వేల రూపాయిలు ఆర్థిక” సహాయం.

గుంతకల్, ఇటీవల కాలంలో అకాల మృతిచెందిన గుంతకల్ పట్టణం జనసైనికుడు కావాలి రవి కుమార్ పిల్లల చదువుకు చేయూతగా 13వ వార్డు జనసేన పార్టీ ఇన్చార్జి బండి శేఖర్ సమక్షంలో పుస్తకాల సామాగ్రి మరియు 10 వేల రూపాయల నగదు ఆర్థిక సహాయం వాసగిరి మణికంఠ అందించారు. అలాగే భవిష్యత్తులో కూడా కావాలి రవి కుమార్ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంతకల్ చిరంజీవి యువత పాండు కుమార్ జనసైనికులు సూర్యనారాయణ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.