విద్యార్థులకు ఎప్పుడూ జనసేన అండగా ఉంటుంది: జనసేన ఎంపీటీసీ విక్రమ్

ఆముదాలవలస, ప్రభుత్వం(డిపో మేనేజర్) పిల్లలకు అదనంగా బస్ కావాలి ఆముదాలవలస నియోజకవర్గం, ఉప్పినవలస గ్రామంలో స్టూడెంట్స్ ఇబ్బంది, ముఖ్యంగా ఆడపిల్లలు నిల్చోడానికి కూడా చోటు లేక చాలా ఇబ్బందులు పడి సోమవారం ధర్నా చేశారు. పాలకొండ నుంచి శ్రీకాకుళానికి బస్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన ఎంపీటీసీ అంపిలి విక్రమ్ మరియు జనసేన నాయకులు మల్లేష్ విద్యార్థులకు అండగా నిలిచారు. ఈ సమస్య ప్రతి నెల జరుగుతుంది ఒక రెండు రోజులు ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా పెట్టి మళ్ళీ యదావిధిగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈసారి దీనిపై డిపో అధికారులు దృష్టి పెట్టు అదనంగా బస్ వేసి విద్యార్థులకు న్యాయం చెయ్యాలని విద్యార్థులు తరుపున మేము కోరుకుంటున్నామని తెలిపారు.