కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన కృతజ్ఞతలు

చంద్రగిరి నియోజకవర్గం: రాష్ట్ర జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఇవ్వడం పట్ల చంద్రగిరి నియోజకవర్గ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నామని, మా అధినేత శ్రీ కె. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును, కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం చాలా శుభదినంగా జనసేన పార్టీ నాయకులు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నామని చంద్రగిరి నియోజకవర్గ జనసేన మరియు కాపు సంక్షేమ సేన రైతు విభాగం అధ్యక్షుడు తిరుపతి జిల్లా మరియు జనసేన నాయకులు శివ పేర్కొన్నారు. ఈ సంతోష సమయంలో దామలచెరువు గ్రామం ప్రజలు స్వీట్లు పంపిణీ చేసి 2024 ఎన్నికల్లో ప్రజలందరూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలందరినీ కోరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ మరియు కాపు సంక్షేమ సేన రైతు విభాగం అధ్యక్షుడు తిరుపతి జిల్లా, మరియు పార్టీ నాయకులు శివ, లక్ష్మీపతి, బాలకృష్ణ, ఉదయ్, కార్యకర్తలు అందరూ కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలిపారు.