కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ జనసేన: కాల్వ రాజశేఖర్

మంథని: ప్రతి జనసేన కార్యకర్త భద్రత భరోసా కోసం అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచించి రూపొందించిన ఐదు లక్షల రూపాయల జీవిత బీమా మరియు 50 వేల రూపాయల ప్రమాద బీమాతో కూడిన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మంథని నియోజకవర్గంలో ప్రారంభం అయిందని జనసేన కార్యకర్తలు అందరూ పార్టీ సభ్యత్వం స్వీకరించాలని జనసేన నియోజకవర్గ నాయకులు మరియు భూపాలపల్లి జిల్లా నాయకులు కాల్వ రాజశేఖర్ పిలుపునిచ్చారు. అలాగే ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మరణించిన 96 మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కింద నాలుగు కోట్ల 80 లక్షలు, ప్రమాదవశాత్తూ గాయపడిన 169 మంది జనసైనికులకి 60 లక్షల 80 వేల రూపాయలు అధినేత పవన్ కళ్యాణ్ అందజేశారని తెలిపారు. పార్టీ జెండాను భుజాన మోసే ప్రతి కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ జనసేన పార్టీ, అని నియోజకవర్గ జనసేన కార్యకర్తలు అందరూ ఈ సభ్యత్వ స్వీకరణ ప్రక్రియను చివరి తేదీ ఫిబ్రవరి 28 లోపు సద్వినియోగం చేసుకోవాలని పార్టీ సభ్యత్వం తీసుకోవాలి అనుకునేవారు ఫోన్ నెంబర్ 9848921091 సంప్రదించి, వారి పేరు వివరాలు తెలపాలని సూచించారు. అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేసీ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తుందని తెలిపారు.