జనసేన నాయకుడు రాజేష్ కుటుంబానికి అండగా నిలచిన జనసేన

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన జనసేన నాయకుడు రాజేష్ తండ్రి ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే, అయితే ఆర్ధికంగా, కుటుంబ పరంగా వెనక ముందు ఎవ్వరూ లేని రాజేష్ కి ఆలోటు తెలియకుండా అన్ని తానే అయి నడిపించింది జనసేన ఫ్యామిలీ, మీ నడవడిక చూస్తే మాకు పవన్ కళ్యాణ్ గుర్తుకువస్తున్నారని, ఆ నిరుపేద కుటుంబం కన్నీళ్లు పెట్టుకోగా వారు చూపే కృతజ్ఞతకి జనసైనికులంతా మరింత కలతచెందారు, రాజేష్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ జనసేన అనే ఫ్యామిలీని అందించిన పవన్ కళ్యాణ్ కి ధన్యవాదములు, అలాగే సహకరించిన జనసేన ఫ్యామిలీ మెంబర్స్ రాజశేఖర్, సనత్, పంజా, సుమన్, నాగరాజు, అభి, రాజకుమార్, మల్లేష్, సుధాకర్, పవన్ లకు ధన్యవాదములు తెలియజేసారు. జిల్లా నాయకులు వాసు గౌడ్ కు సోమవారం జరిగిన 11వ రోజు కార్యక్రమంలో జనసేన ఫ్యామిలీ తోడైనందులకు పవన్ కళ్యాణ్ కి రెండు చేతులు జోడిస్తూ రాజేష్ కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు, ఈ సందర్భంగా వాసు గౌడ్ మాట్లాడుతూ ఆ కుటుంబానికే కాదు ఏ జనసైనికుడికి ఆపద వచ్చినా కూడా మా సైనికుడిని మేము కాపాడుకుంటామని మా సైనికుల భద్రతే పవన్ కళ్యాణ్ గారికి, మాకు ముఖ్యమని వాసు గౌడ్ తెలియజేశారు.