మత్స్యకారులకు మద్దతుగా జనసేన జలదీక్ష

•హెటిరో పైప్ లైన్ తొలగింపుకు డిమాండ్

హెటిరో డ్రగ్స్ కంపెనీ యాజమాన్యం రసాయిన వ్యర్ధాలు సముద్రంలో కలిపేందుకు నిర్మించిన పైప్ లైన్ తొలగించాలని డిమాండ్ చేస్తూ నక్కపల్లి మండల మత్స్యకారులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జలదీక్ష నిర్వహించారు. పైప్ లైన్ ను వెంటనే తొలగించాలని యాజమాన్యాన్ని కోరారు. కంపెనీ నుంచి వచ్చే రసాయిన వ్యర్ధాలు సముద్రంలో కలపడం కారణంగా మత్స్యసంపద దెబ్బతిని స్థానిక మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారంటూ జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలు మత్స్యకారులకు మద్దతుగా వివిధ రూపాల్లొ స్థానిక జనసేన శ్రేణులు నిరసన తెలిపాయి. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనససైనికులతో పాటు మత్స్యకారులు పాల్గొన్నారు.