తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జనసేన జాని

పాలకొండ, జనసేన జానీ మాట్లాడుతూ ఆధునిక భాషా విజ్ఞాన సర్వస్వం గిడుగు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా, తొలి తెలుగు ఆధునిక భాషా వేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా… జనసేన పార్టీ వీరఘట్టం మండల జనసేన జానీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వాసిగా వ్యవహారిక భాషా ఉద్యమానికి ఊరూరా సభలు, సమావేశాలు జరిపించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన గిడుగు వెంకట్ రామూర్తి కృషి ఫలితంగానే తెలుగు భాషకు గ్రాంథికం నుంచి సరళత లభించిందన్నారు. ఆయనొక ఆధునిక భాషా విజ్ఞాన సర్వస్వమని చెప్పారు. ఆధునిక కాలంలో మనం చదువుతున్న అంశాలన్నీ వ్యవహారిక భాషలో ఉండటం వెనుక ఆయన చేసిన అవిరామ కృషి కనిపిస్తుందని చెప్పారు. వ్యవహారిక భాష కోసమే కాక సవర భాష కోసం ఆయన చేసిన సవర భాషోద్యమం, అనితరసాధ్యమని జనసేన జాని అన్నారు. ఆ మహనీయుని స్మరించుకుంటూ బొడ్లపాడు ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.