కాకినాడ వార్ఫ్ రోడ్డులో షేం షేం స్కాం స్కాం కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో శుక్రవారం కాకినాడ వార్ఫ్ రోడ్డులో షేం షేం స్కాం స్కాం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు నిన్న కాకినాడ వార్ఫ్ రోడ్డులో పెట్రోల్ బంక్ వద్ద జరిగిన వై.సి.పి స్థానిక శాశనసభ్యుడి అనుచరుల దౌర్జన్యాన్ని నిరశిస్తూ షేం షేం స్కాం స్కాం కార్యక్రమాన్ని నిర్వహించి పోస్టర్లను విడుదల చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ సిటి ప్రశాంతమైన నగరంగ రాష్ట్రంలోనే పేరు పొందిందనీ పైగా దీన్ని ఎడ్యుకేషన్ సెంటర్గా జిల్లాలో పరిగణిస్తారనీ అలాంటి నగరంలో నేడు నెలకొన్న పరిస్థితులని ఖండించారు. కాకినాడలో రక్షణ కరువైందని ప్రజలే కాదు నిన్నటినుండీ వ్యాపారస్తులు కూడా భయాందోళణలకు గురవుతున్నారన్నారు. జగన్ రాష్ట్రానికి కావలని కార్యక్రమాలు చేస్తునారనీ, ఇందుకేనా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వేధింపులు, దౌర్జన్యాలు ఇంకో మూడునెలలే అని ఆతరువాత వీళ్ళెలాగూ ఇంటికే అని అందుకే తమ ఉక్రోషాన్ని వెళ్ళగక్కుతున్నారని ఎద్దేవా చేసారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, మనోహర్లాల్ గుప్తా, ఆకుల శ్రీను, సతీష్ కుమార్, సాయి యాదవ్, పోలిశెట్టి రామారావు, ముత్యాల దుర్గాప్రసాద్, వాసిరెడ్డి సతీష్, చెక్కపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు.