పత్తికొండ పోలీస్ స్టేషన్ కు జనసేన నాయకుడు సి జి రాజశేఖర్ తరలింపు

  • ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే ముందస్తు అరెస్టులు
  • వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నించే ఏ వ్యక్తికైనా స్వేచ్ఛ స్వతంత్రం లేదా,

పత్తికొండ నియోజకవర్గం: క్రిష్ణగిరి మండలంలో హంద్రీనీవా పంప్ హౌస్ ద్వారా పత్తికొండ డోన్ నియోజవర్గంలో 77 చెరువులకు నీళ్లు నింపే ప్రారంభానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా పత్తి కొండలో సిజి రాజశేఖర్ ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, మా పత్తికొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు మా పత్తికొండ నియోజకవర్గానికి అనేక హామీలు ఇవ్వడం జరిగింది, అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, ఇచ్చిన హామీలు మరిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలని శాంతియుతంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది, ఈ క్రమంలో జనసేన పార్టీ నాయకుడు సిజి రాజశేఖర్ ఇంటి దగ్గరికి పత్తికొండ ఎస్సై వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ ముందస్తుగానే బలవంతంగా సిజి రాజశేఖర్ ను పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతని నొక్కేయాలి అనుకోవడం ఆ ప్రజాస్వామ్యంగా తెలియజేస్తున్నాను, సూర్యుని అరిచేతతో ఎవరైనా ఆపగలరా, అలాగే ప్రజాస్వామ్యంలో పోరాడే మాలాంటి వ్యక్తులను ఎవరూ ఆపలేరని తెలియజేశారు, ఇలాగే ఈ వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థని ముందు పెట్టుకొని మాలాంటి నాయకులు భయపడితే భయపడతారు అనుకుంటే మీది మూర్ఖత్వం అని అన్నారు.