ప్రీతీ కుటుంబాన్ని పరామర్శించిన నేమూరి శంకర్ గౌడ్

హైదరాబాద్: తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రీతి కుటుంబాన్ని జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ వెల్తూరి నగేష్ పరామర్శించారు. అనంతరం జనసేన పార్టీ నేమూరి శంకర్ గౌడ్ ప్రీతీ సోదరి పూజను ఫోన్ ద్వారా పరామర్శించి, అన్ని విధాలుగా జనసేన పార్టీ తరఫున అండగా ఉండి క్షేత్రస్థాయిలో పరిశీలించి, న్యాయం జరిగే విధంగా జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఈ విషయాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉందని, కచ్చితంగా ప్రీతీకి న్యాయం జరిగే విధంగా చూస్తామని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.