మొహరం సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన జనసేన నాయకులు

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి పట్టణం పడమర వీధిలో ఉన్న పీర్ల పంజాలో మొహరం పండగను పురస్కరించుకుని సోమవారం 9వ రోజు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు దర్గా దగ్గర ఉన్న ముస్లిం మైనార్టీ మహిళలు ఉద్దేశించి చల్లపల్లి మండలం అధ్యక్షులు విమల్ కృష్ణ మాట్లాడుతూ.. కర్బలా మైదానంలో పవిత్ర యుద్ధం లో అసువులు బాసిన మహమ్మద్ ప్రవక్త గారి వంశీకులు 72 మంది అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో మోహన్ పండుగ నిర్వహించడం జరుగుతుంది. మొహరం పండుగ అంటే చాలా మందికి తెలియదు దుఃఖ దినాలు అని జనసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో, అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాడ శేషుబాబు, మండల అధ్యక్షులు విమల్ కృష్ణ, చల్లపల్లి టౌన్ అధ్యక్షులు ముత్యాల ప్రసాద్, పసుపులేటి రవి, శేఖర్, అంచల సాయి, సోమిశెట్టి రాఘవ, షఫీ, అవినాష్, నరేష్, మల్లం నాంచారయ్య జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.