జనసేన నాయకులు పెండ్యాల శ్రీలత, హరికి అభినందనల వెల్లువ

*కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, గుమ్మడిసాని శిల్ప ఆధ్వర్యంలో గజమాలతో సత్కారం

శింగనమల, జనసేనపార్టీ వీరమహిళ విభాగం రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలుగా ఎన్నికైన పెండ్యాల శ్రీలతని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ మేరకు సోమవారం శింగనమల నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, గుమ్మడిసాని శిల్ప ఆధ్వర్యంలో పెండ్యాల శ్రీలత, పెండ్యాల హరి దంపతులకు గజమాలతో సన్మానం చేయడం జరిగింది. అనంతరం వారు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం, బలోపేతం చేయడం పై చర్చించి మండలాల వారిగా నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేనపార్టీ వీరమహిళా విభాగం రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత, జిల్లా నాయకులు పెండ్యాల హరి సారధ్యంలో నియోజకవర్గంలో జనసేనపార్టీ బలోపేతం చేసి ప్రతి గ్రామంలో జెండా ఎగరవేసే దిశగా అడుగులు వేస్తామని అన్నారు.

గుమ్మడిసాని శిల్ప మాట్లాడుతూ… పార్టీలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ పెద్ద పీట వేయడం గర్వంగా ఉందని, ముఖ్యంగా నార్పల మండలానికి చెందిన పెండ్యాల శ్రీలత కి రాయలసీమ కమిటీలో చోటు కల్పించడం ఆనందంగా ఉందని అన్నారు. మహిళలలో ఉన్న నాయకత్వాన్ని వెలికి తీసి పార్టీలో అనేక అవకాశాలు కల్పిస్తున్న పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయుడు, నియోజకవర్గ నాయకులు తోట ప్రకాష్, విశ్వనాథ్ రెడ్డి, కృష్ణమూర్తి మండల అధ్యక్షులు ఎర్రిస్వామి, ఓబులేసు, రామయ్య, దండు హరీష్, పృథ్వి రాయల్, గిరీష్, లోకేష్, మురళికృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.