వంచుల, కొత్తపాలెం గ్రామ ప్రజలతో సమావేశమైన జనసేన నాయకులు

అల్లూరీ సీతారామరాజు జిల్లా, గూడెం కొత్తవీధి మండలంలో
జనసేన పార్టీ నాయకులు కిల్లో రాజన్, ఉల్లి సీతారామ్ తదితర నాయకులు గ్రామ పర్యటన బాట పట్టారు. పర్యటనలో భాగంగా వంచుల, కొత్తపాలెం గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. జనసేన పార్టీ అధినేతకు గిరిజనాభివృద్దిపై ఒక స్పష్టత ఉందని కచ్చితంగా అతను సేవే లక్ష్యంగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తియన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చూడాలంటే జనసేన పార్టీ మాత్రమే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీ కి ఒక అవకాశం ఇవ్వాలని మనమంతా మార్పు కొరకు సిద్ధపడాలన్నారు. ఈ సందర్బంగా వారికి జనసేన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు, ఆశయాలు తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి పలువురు యువకులు, గ్రామస్తులు కిల్లో రాజన్, ఉల్లి సీతారామ్ చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పుకుని జనసేన పార్టీలో చేరారు. వారికి జనసేన కుటుంబంలో సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు, జనసైనికులు, గ్రామస్థులు పాల్గొన్నారు.