నాదెండ్ల తో జనసేన నాయకుల మర్యాద పూర్వక భేటీ

సోమవారం రాత్రి 9 గం లకు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని మర్యాద పూర్వకంగా హల్కన్ టైంలో కందరాడ ఎంపీటీసీ పిల్లా సునీతాసూర్యనారాయణ (దినేష్) కలవటం జరిగింది. జనసేన నాయకులు పిఎసి సభ్యులు పంతం నానాజీ ని, మండపేట ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ, అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, యలమంచిలి ఇంచార్జ్ సుందరపు శ్రీనివాస్ కలవటం జరిగింది. జనసేన ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి తోలేటి శిరీష, జనసేన నాయకులు వెన్నా జగదీష్, ఎంపీటీసీ అభ్యర్థి సూరిబాబు, గంజి గోవిందరాజులు, శివరామకృష్ణ, దొరబాబు, చక్రి,ఇస్సాకు, పిఠాపురం మరియు కాకినాడ జిల్లా జనసైనికులు చాలా మంది పాల్గొన్నారు.