గోపాలరావుకు జనసేన నాయకుల ఘననివాళులు

భావదేవరపల్లి జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముమ్మారెడ్డి శ్రీను తండ్రి గారైన గోపాలరావు ఇటీవల కాలం చేసిన విషయం అందరికి విధితమే.. గురువారం భావదేవరపల్లిలోని వారి స్వగృహం నందు గోపాలరావు పెదకర్మ కార్యక్రమంలో నివాళులు అర్పించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండలి రాజేష్, నాగాయలంక మండల నాయకులు బండ్రెడ్డి హరి, మల్లికార్జున, మురళి, సురేష్, నరేష్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.