పొన్నలూరు ఎంపీడీఓకి ధన్యవాదాలు తెలిపిన జనసేన నాయకులు

  • 10 రోజుల్లో వాటర్ ప్లాంట్ కూడా తిరిగి ప్రారంభిస్తాం అని ఎంపీడీఓ ప్రజలకు హామీ

కొండపి నియోజకవర్గం: పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో 25-10-2023 వ తేదీన పొన్నలూరు మండలంలో అగ్రహారం పంచాయతీలో డ్రైనేజీ మరియు వాటర్ ప్లాంట్ సమస్యను పరిష్కరించండి అని ఎంపీడీఓ కల్పనకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎంపీడీఓ వెంటనే స్పందించి మంగళవారం డ్రైనేజీ సమస్యను పరిష్కరించడం జరిగింది. రాబోయే 10 రోజుల్లో ప్రజలకు త్రాగునీరు కల్పించే విధంగా నిరుపయోగంగా ఉన్న వాటర్ ప్లాంట్ ను కూడా తిరిగి ప్రారంభిస్తాము అని ప్రజలకు హామీ ఇచ్చారు. జనసేన నాయకులు మంగళవారం అగ్రహారంలో పర్యటించి పనులు జరుగుతున్న డ్రైనేజీని పరిశీలించి, ఇటువంటి అధికారులు ఉండటం వలన వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, ప్రజలు కూడా సంతోషంగా ఉండగలుగుతారు అని అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ మహబూబ్ బాషా (ప్రధాన కార్యదర్శి), సుంకేశ్వరం శ్రీను (కార్యదర్శి), కాకాని ఆంజనేయులు(కార్యదర్శి), ద్రోణాదుల శివకిషోర్ (కార్యదర్శి) మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.