రిటర్నింగ్ ఆఫీసరును ప్రశ్నించిన జనసేన

తెలంగాణ, శేరిలింగంపల్లి జనసేన పార్టీ ఆఫీసు యొక్క ఫ్లెక్సీలు, పార్టీ ఆఫీసుకి అంటించబడిన స్టిక్కర్లు రెండవసారి తొలగించడం జరిగింది. ఎన్నికలలలో పని చేస్తున్న వాళ్లకి కనీస నియమనిబంధనలు తెలియకుండా ఎలా పనిచేస్తారు అని జనసేన ప్రశ్నించడం జరిగింది. గతంలో అక్టోబర్ 13న పార్టీ ఆఫీస్ పై జరిగిన దాడికి జనసేన వివరణ కోరగా రిటర్నింగ్ ఆఫీసర్ సమాధానం లేక తెల్ల మొహం వేయడం జరిగింది. ఒక పార్టీ కార్యాలయంలో పురావృతం అవుతున్న దాడులను ఖండించి అధికారుల నిర్లక్ష్యాన్ని సాక్ష్యాధారాలతో సహా రిటర్నింగ్ ఆఫీస్ ఎదుట ఉంచడం జరగడంతో రిటర్నింగ్ ఆఫీసర్ జనసేనకు క్షమాపణలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.