దేవరపల్లి పంచాయితీలో పర్యటించిన జనసేన నాయకులు

ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మండలంలోని పాత దేవరపల్లి పంచాయితీలో పర్యటించి గ్రామంలోని చిన్నపాటి వర్షం పడినా గ్రామంలో వీధులన్ని బురదమయం అవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారని, అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయినా గ్రామాల్లో కనీస మౌళికవసతులు లేవని ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ఓటు వేయించుకొని గెలిచిన తరువాత కనబడటం లేదని ఇప్పటికైనా నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గాని, మండల నాయకులు గాని, గ్రామ పంచాయతీ సంబంధించిన సిబ్బంది గానీ, వెంటనే గ్రామంలోని రోడ్లు, సైడ్ కాలువలు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్, జనసైనికులు ఇంతియాజ్, షేక్ భుజ్జ సాహెబ్, ఎస్ దాని, అలీం మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.