కాళంగి రిజర్వాయర్ ని సందర్శించిన జనసేన నాయకులు

సత్యవేడు నియోజకవర్గం, కే.వి.బి. పురం మండలం కాళంగి రిజర్వాయర్ ని మండల ఉపాధ్యక్షుడు మోహన్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్యకుమార్ హాజరయ్యారు. ఈ రిజర్వాయర్ దశాబ్దాల కాలంగా ఎలాంటి మరమ్మతులు చేయకపోవడం వలన శిథిలావస్థకి చేరుకుంది. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్న ఎలాంటి ప్రయోజనం లేదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారని స్థానిక రైతులు తెలియజేసారు. మండల అధ్యక్షుడు థామస్ ఆధ్వర్యంలో ఈ సమస్యను జనవాణి కార్యక్రమం ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సతీష్, సిద్ధయ్య, మునిశేఖర్, మోతిలాల్, దొరబాబు, రాజేష్, మునెయ్య, స్టీఫెన్, కిషోర్, లవకుమార్, త్యాగరాజ్, కళ్యాణ్, బతయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *