క్రియాశీలక సభ్యుడు కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి మండలం, ముచ్చివోలు గ్రామానికి చెందిన క్రియాశీలక సభ్యుడు మద్దూరు వెంకటరమణ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ఆర్థిక సాయం అందించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఎలాంటి సమస్య ఉన్నా జనసేన పార్టీ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జానీ భాషా, చిరంజీవి, ఢిల్లీబాబు, నారాయణ, చైతన్య, నవీన్ మరియు ఇతరులు పాల్గొన్నారు.