క్షతగాత్రులను పరామర్శించిన జనసేన నాయకులు

పాలకొండ, గురువారం జరిగిన ఎస్.ఎల్.ఆర్ మిల్లి సమీపంలో రాజాం టు పాలకొండ ప్రధాన రహదారి నుంచి వస్తున్న ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణించిన బొడ్డవలస గ్రామానికి చెందిన నలుగురు మహిళలు గాయాలు పాలయ్యారు. పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆదేశాల మేరకు వారిని పాలకొండ ఏరియా ఆసుపత్రిలో జనసేన నాయకులు సతివాడ వెంకటరమణ, డొంపాక సాయి కుమార్ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వారికి ఉచిత వైద్యంతో పాటు, ఆర్థిక సహాయం ప్రకటించాలని కోరారు.