వినాయక మండపాలను సందర్శించిన జనసేన నాయకులు

గుంటూరు: పట్టణంలోని కొత్తపేట లోని వివిధ వినాయకుని మండపాలను శనివారం జనసేన పార్టీ నాయకులు సందర్శించటం జరిగినది. మండపాలను గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మి దుర్గ, పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి పాకనాటి రమాదేవి, జనసేన నాయకులు బడే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.