జనసేన కార్యకర్తని పరామర్శించిన జనసేన నాయకులు

ఆముదాలవలస నియోజకవర్గం, చిన్నలంకం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త సాయి అనే యువకుడు ఇటివలే పుట్టి పని చేస్తున్నప్పుడు అనుకోకుండా కరెంట్ షాక్ ప్రమాదానికి గురిఅయ్యాడు..ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ అభ్యర్థి కొత్తకోట. నాగేంద్ర, ఎంపీటీసీ సిక్కోలు. విక్రమ్.. ప్రమాద బాదితుని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ కుటుంబానికి జనసేన తోచిన సాయం మరియు ఎల్లప్పుడు అండగా ఉంటుంది అని ఈ సందర్భంగా భరోసా ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సంగం నాయుడు, జైరాం మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.