నరసాపురం జనసేన అధ్వర్యంలో అర్ధనగ్న నిరసన

నరసాపురం, ఆదివారం విశాఖపట్టణంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనసేన భరోసా జనవాణి కార్యక్రమానికి శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటూ జనసేన శ్రేణులు భారీ ఎత్తున విశాఖ పట్టణం చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంలో పోలీసులు జనసేన నాయకులను అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. వైజాగ్ లో మన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు జనసైనికుల అక్రమ అరెస్టులకు నిరసనగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసైనికులు అర్ధ నగ్న ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.