అంకమ్మ తల్లి తిరణాలలో పాల్గొన్న జనసేన నాయకులు

సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలంలో అంకమ్మ తల్లి తిరణాల మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జనసేన అధ్యక్షులు నరసయ్య ఆహ్వానం మేరకు జనసేన నాయకులు హాజరై అమ్మవారిని దర్శనం చేసుకుని, తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరావు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, రాజుపాలెం మండల అధ్యక్షులు. తోట నరసయ్య, తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, సత్తెనపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు తోట లక్ష్మి నారాయణ, రాజుపాలెం మండలం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు, రాజుపాలెం మండలం ప్రధాన కార్యదర్శి కేదారి రమేష్, తమ్మిశెట్టి మహేష్, హరిబాబు పాల్గొన్నారు.